అరవింద్‌తో అమిత్ షా భేటీ

by  |
అరవింద్‌తో అమిత్ షా భేటీ
X

న్యూఢిల్లీ: ఢిల్లీలో కరోనా వైరస్ క్రమేనా విజృంభిస్తోంది. దీంతో దేశ రాజధానిలో కొవిడ్ నివారణపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఢిల్లీ సీఎం కేజ్రివాల్, లెప్టినెంట్ గవర్నర్ అనీల్ బాయ్‌జల్‌తో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సమావేశం నిర్వహించారు. ఢిల్లీలో కరోనా ప్రభావం, తాజా పరిస్థితులు, నివారణ చర్యలపై నేతలు చర్చలు జరపుతున్నట్లు సమాచారం. కరోనా వైరస్ నేపథ్యంలోనే ఈ భేటీ నిర్వహిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ ఓ ప్రకటనలో తెలిపిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులు, ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed