ఫోన్‌ యూజ్ చేయబోనని బాలీవుడ్ హీరో ప్రతిజ్ఞ

by  |
ఫోన్‌ యూజ్ చేయబోనని బాలీవుడ్ హీరో ప్రతిజ్ఞ
X

దిశ, సినిమా: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ షూటింగ్‌ కంప్లీట్ చేశాడు. అద్వైత్ చందన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా.. క్రిస్మస్ 2021కు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసింది మూవీ యూనిట్. సకాలంలో ఈ పని పూర్తి చేయాలంటే తప్పకుండా మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేయాలని నిర్ణయించుకున్నాడట అమీర్. హీరో సెల్ ఫోన్‌కు అడిక్ట్ అయిపోగా.. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ వర్క్ రెండింటిపై ఎఫెక్ట్ పడుతుందని భావించే ఇలా డిసైడ్ అయ్యారని సమాచారం. ఫోన్ లేకుంటేనే.సమయానికి వర్క్‌కి వెళ్లగలనని, సరిగ్గా పనిచేసుకోగలనని అనుకున్నారట. ఖాళీగా ఉన్న సమయంలో ఫ్యామిలీతో గడపనున్నారు అమీర్.. ఏవైనా అర్జెంట్ ఇష్యూస్ ఉంటే మేనేజర్‌ను సంప్రదించాలని అమీర్ సూచించారు. ఇక నుంచి తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను అమీర్ టీం ఆపరేట్ చేయనుంది.

2021లో రిలీజ్ అవుతున్న భారీ ప్రాజెక్ట్స్‌లో ‘లాల్ సింగ్ చద్దా’ ఒకటి. అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ‘3 ఇడియట్స్’ తర్వాత కరీనా కపూర్ ఖాన్‌ అమీర్‌తో ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండగా.. ఇప్పటికే తన షూటింగ్ పోర్షన్ కంప్లీట్ చేసింది. ‘లాల్ సింగ్ చద్దా’పై పూర్తి కాన్సంట్రేషన్ చేసిన అమీర్.. తన స్నేహితుడు అమీన్ హజీస్ డైరెక్టోరియల్ డెబ్యూ ‘కోయి జానె నా’ చిత్రంలో అతిథి పాత్రలో నటించారు.



Next Story

Most Viewed