సీఎం కాదు కదా ఎమ్మెల్యే కూడా కాలేవు

by  |
సీఎం కాదు కదా ఎమ్మెల్యే కూడా కాలేవు
X

దిశ, ఏపీ బ్యూరో: అధికారం లేకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బతకలేరంటూ వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే చంద్రబాబు ఏడుస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఏడ్చేవారికి అధికారమిస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అధికారం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కేందుకైనా వెనుకాడరన్నారు. అందుకే అసెంబ్లీలో శపథం చేసి మరీ వెళ్లిపోయారని విమర్శించారు.

భవిష్యత్‌లో చంద్రబాబు అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఉండదని చెప్పుకొచ్చారు. సీఎంగా కాదు కదా? ఎమ్మెల్యేగా కూడా అసెంబ్లీలో చంద్రబాబు అడుగుపెట్టే ఛాన్స్ లేదన్నారు. చంద్రబాబు రాష్ట్రానికి శనిలా దాపురించారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వేవ్‌ ముందు టీడీపీ కొట్టుకుపోతుండటంతో చేసేది లేక సింపథీ రాజకీయాలకు ప్రయత్నిస్తున్నారని విరుచుకుపడ్డారు. అందుకే ఏడుపులు..పెడబొబ్బలు పెడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు జగన్ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారని..అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతుండటంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. వైసీపీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక ప్రతిరోజూ చంద్రబాబు ఏడవడమే పనిగా పెట్టుకున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు.

Next Story

Most Viewed