అమర్ నాథ్ యాత్ర.. ఎప్పటి నుంచంటే

by  |
అమర్ నాథ్ యాత్ర.. ఎప్పటి నుంచంటే
X

కశ్మీర్: అమర్ నాథ్ యాత్రకు తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు యాత్ర తేదీలను అమర్ నాథ్ దేవస్థానం బోర్డు వెల్లడించింది. అషాడ చతుర్థీ(జూన్ 28న) ఈ యాత్ర ప్రారంభం కానున్నట్టు బోర్డు తెలిపింది. 56 రోజుల పాటు ఈ యాత్ర కొనసాగుతుందని… అనంతరం అగస్టు 22 శ్రావణ పూర్ణిమా( రక్షా బంధన్)రోజున ఈ యాత్ర ముగియనున్నట్టు అధికారులు వెల్లడించారు.

యాత్ర నేపథ్యంలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. 13 ఏండ్లలోపు, 75 ఏండ్ల పైబడిన వారిని ఈ యాత్రకు అనుమతించబోమని అధికారులు చెప్పారు. ఇక యాత్ర కోసం ఏప్రిల్ 1 నుంచి ముందస్తు రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని అధికారులు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్‌, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంక్, యెస్ బ్యాంకుల ద్వారా ఈ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని తెలిపారు.

Next Story

Most Viewed