అమర రాజా బ్యాటరీస్ నికర లాభం రూ. 201 కోట్లు

by  |
అమర రాజా బ్యాటరీస్ నికర లాభం రూ. 201 కోట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ నికర లాభం 7.93 శాతం క్షీణించి రూ. 201.27 కోట్లుగా వెల్లడించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ రూ. 218.61 కోట్ల లాభాలను ఆర్జించింది. సమీక్షించిన త్రైమాసికంలో కార్యకలాపాల ఆదాయం 14.16 శాతం పెరిగి రూ. 1,935.52 కోట్లకు చేరుకుందని, గతేడాది ఇదే కాలంలో కంపెనీ ఆదాయం రూ. 1,695.31 కోట్లని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

‘ఈ త్రైమాసికంలో అన్ని రంగాల్లో డిమాండ్ పుంజుకోవడంతో సంస్థ పనితీరు మెరుగ్గా కొనసాగింది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు బలమైన కార్యాచరణ మార్గదర్శకాలను అమలు చేయడంతో ఉత్పాదక సామర్థ్య వినియోగం, పంపిణీ కార్యకలాపాలను పెంచేందుకు వీలైందని’ అమర రాజా సీఈవో ఎస్ విజయానంద్ తెలిపారు. రెండో త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఖర్చులు 13.11 శాతం పెరిగి రూ. 1,676.03 కోట్లకు చేరుకున్నాయి. త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్లు మంగళవారం సెన్సెక్స్‌లో 4.03 శాతం పెరిగి రూ. 789.10 వద్ద ముగిశాయి.



Next Story

Most Viewed