- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై అల్లు అరవింద్ అధికారికంగా స్పందించారు. తేజ్కు ఎలాంటి ప్రమాదం లేదని, రేపటి సాయంత్రానికి బయటకు వస్తాడని ఆయన ప్రకటించారు. మీడియాలో రకరకాలు వార్తలు రాస్తారనే ఉద్దేశంతోనే తాను ముందుగా స్పందిస్తున్నానని పేర్కొన్నారు. వైద్యులు మరో గంటలో తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని, మీడియా సందేహాలను కూడా తీర్చుతారని అల్లు అరవింద్ వెల్లడించారు.
కాగా, సాయి ధరమ్ తేజ్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అతివేగం, నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ చేసినందుకు గాను కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతివేగంతోనే ప్రమాదం జరిగిందని, సీసీ టీవీల్లోనూ అదే నమోదైందని వెల్లడించారు. సాయి కింద పడిన ప్రదేశంలో ఓ బైక్, ఆటో కూడా వెళ్తోంది. మూడో లైన్ నుంచి వేగంగా మొదటి లైన్ లోకి వచ్చి తేజ్ కింద పడిపోయాడు. కిందపడిన తర్వాత ఆయన 100 మీటర్లకు పైగా బైక్ తోసహా జారీ పోయాడు. హెల్మెట్ ధరించడం వల్లనే ఆయన ప్రాణాలతో బయటపడ్డట్టు సన్నిహితులు పేర్కొంటున్నారు.