సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై స్పందించిన అల్లు అరవింద్

by  |
allu aravind
X

దిశ, వెబ్‌డెస్క్ : సాయి ధరమ్ తేజ్ ప్రమాదంపై అల్లు అరవింద్ అధికారికంగా స్పందించారు. తేజ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని, రేపటి సాయంత్రానికి బయటకు వస్తాడని ఆయన ప్రకటించారు. మీడియాలో రకరకాలు వార్తలు రాస్తారనే ఉద్దేశంతోనే తాను ముందుగా స్పందిస్తున్నానని పేర్కొన్నారు. వైద్యులు మరో గంటలో తేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేస్తారని, మీడియా సందేహాలను కూడా తీర్చుతారని అల్లు అరవింద్ వెల్లడించారు.

Accident

కాగా, సాయి ధరమ్ తేజ్ పై మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అతివేగం, నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ చేసినందుకు గాను కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతివేగంతోనే ప్రమాదం జరిగిందని, సీసీ టీవీల్లోనూ అదే నమోదైందని వెల్లడించారు. సాయి కింద పడిన ప్రదేశంలో ఓ బైక్, ఆటో కూడా వెళ్తోంది. మూడో లైన్ నుంచి వేగంగా మొదటి లైన్ లోకి వచ్చి తేజ్ కింద పడిపోయాడు. కిందపడిన తర్వాత ఆయన 100 మీటర్లకు పైగా బైక్ తోసహా జారీ పోయాడు. హెల్మెట్ ధరించడం వల్లనే ఆయన ప్రాణాలతో బయటపడ్డట్టు సన్నిహితులు పేర్కొంటున్నారు.

Next Story

Most Viewed