రిజర్వేషన్ల ప్రకారమే సీట్ల కేటాయింపు.. పుకార్లు నమ్మొద్దు

by  |
jntu
X

దిశ, తెలంగాణ బ్యూరో : జేఎన్టీయూలో పార్ట్​టైం పీహెచ్‌డీ ప్రవేశాలపై పుకార్లు నమ్మొద్దని అడ్మిషన్స్​డైరెక్టర్​వెంకటరమణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రిజర్వేషన్ల ప్రకారమే సీట్ల కేటాయింపు జరిగిందని, ఆయన స్పష్టం చేశారు. ఇందులో రిజర్వేషన్ల ఉల్లంఘనలు ఎక్కడా చోటుచేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. జేఎన్టీయూపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఓపెన్​కేటగిరీలో నెట్, సెట్, గేట్, జీప్యాట్​లేదా జేఎన్‌టీయూ ఎంట్రెన్స్‌లో క్వాలిఫై అయిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకే ఓపెన్​కేటగిరీలోనే సీట్లు కేటాయించినట్లు చెప్పారు. అంతేకానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ సీట్లకు ఓపెన్​కేటగిరీకి చెందిన అభ్యర్థులకు కేటాయించలేదని పేర్కొన్నారు. దీనికి ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీలకు చెందిన ఇద్దరు నిపుణులు ఈ జాబితాను వెరిఫై చేశారని, ఆ తర్వాతే రిజిస్ట్రార్, వర్సిటీ అధికారులు ఆమోదం తెలిపారన్నారు.


Next Story

Most Viewed