- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర సాధనలో కీలకపాత్ర పోషించింది యూనివర్సిటీ విద్యార్థులే అని, అలాంటిది ఉస్మానియా యూనివర్సిటీపై ప్రభుత్వానికి ఇంత చిన్నచూపెందుకని ఏఐఎస్ఎఫ్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు హరికృష్ణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిజాం కళాశాలలో శుక్రవారం ‘సేవ్ ఓయూ’ పేరిట క్యాంపెయిన్ నిర్వహించిన కార్యక్రమంలో హరికృష్ణ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఆర్థిక బడ్జెట్లో ఓయూకు ఇవ్వాల్సిన దానికంటే తక్కువ బడ్జెట్ కేటాయించారని, ఈ బడ్జెట్లో అయినా ఓయూకు రూ.700 కోట్లు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను, టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సేవ్ ఉస్మానియా కమిటీ సభ్యులు ఆకం శివసాయి, సాయి భగత్, సందీప్, సురేశ్, వినయ్, వినీత్, నరేశ్, హర్ష, స్వప్న తదితరులు పాల్గొన్నారు.
Next Story