- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ గణనపై కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. ఈమేరకు హైదరాబాద్లో శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. దేశవ్యాప్తంగా చేపట్టబోయే జనగణనలో బీసీ కులాల జనగణన చేపట్టాలని, దీనిపై జాతీయస్థాయిలో ప్రధాని మోడీతో అఖిలపక్ష సమావేశం నిర్వహించేలా చూడాలని కోరారు. అనంతరం శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. 2011లో యూపీఏ ప్రభుత్వం కులాల వారీగా లెక్కలు తీసినా.. నేటి వరకు ప్రకటించలేదన్నారు. దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని చెప్పినట్లుగా శ్రీనివాస్గౌడ్ వెల్లడించారు.
Next Story