రాష్ట్రంలో అన్ని పరీక్షలు వాయిదా : సబితా ఇంద్రారెడ్డి

by  |
రాష్ట్రంలో అన్ని పరీక్షలు వాయిదా : సబితా ఇంద్రారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్ : దసరా పండుగ పూర్తయ్యే వరకు రాష్ట్రంలో నిర్వహించే అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గత కొన్నిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు, కొవిడ్‌ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని వివిధ వర్గాల నుంచి మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌కు విజ్ఞప్తులు వచ్చాయి.

ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పరీక్షల నిర్వహణ అంశంపై పునరాలోచించాలని మంత్రి కేటీఆర్‌ కూడా విద్యాశాఖ మంత్రికి విన్నవించారు. దాంతో దసరా పండగ అయిపోయే వరకు అన్నిరకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సబితారెడ్డి మంగళవారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.

Next Story

Most Viewed