సీఎం కీలక ప్రకటన.. వారందరికీ ఉచితంగా టీకా

by  |
సీఎం కీలక ప్రకటన.. వారందరికీ ఉచితంగా టీకా
X

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన పౌరులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. యువకులు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు. అయితే, 3వ విడత వ్యాక్సినేషన్‌లో భాగంగా 18ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ఇప్పటికే కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది.

Next Story

Most Viewed