యశోద నుంచి గొంగిడి దంపతులు డిశ్చార్జి

by  |
యశోద నుంచి గొంగిడి దంపతులు డిశ్చార్జి
X

దిశ, నల్లగొండ: యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి, నల్లగొండ డీసీసీబీ చైర్మెన్ గొంగిడి మహేందర్ రెడ్డి దంపతులు ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో యశోదా ఆస్ప్రతిలో కరోనా వైరస్ నియంత్రణకు చికిత్స తీసుకున్నారు. తాజాగా కరోనా వైరస్ నుంచి కోలుకోవడంతో శుక్రవారం వారిద్దరూ హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.



Next Story