పీఎస్‌లో మద్యం.. సేవించిన పోలీసులు

by  |
పీఎస్‌లో మద్యం.. సేవించిన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఆ వీడియో ఏమనగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూపురం పోలీస్ స్టేషన్ లో ఇద్దరు కానిస్టేబుళ్లు దర్జాగా కూర్చొని మద్యం సేవించారు. ఇటీవల ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు కర్ణాటక నుండి వచ్చిన అక్రమ మద్యాన్ని సీజ్ చేసి.. ఆ మద్యాన్ని హిందూపురం పోలీస్ స్టేషన్ లో పెట్టారు. అయితే ఆ పోలీస్ స్టేషన్ లోనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఆ మద్యాన్ని సేవించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు పోలీస్ స్టేషన్ లో మద్యం సేవించి వ్యవస్థ పరువు తీశారంటూ ప్రజలు మండిపడుతున్నారు.



Next Story

Most Viewed