మోదీ లెటర్ పై మాట్లాడిన అక్షయ్.. ఏమన్నాడంటే ?

by  |
akshay
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌కు లేఖ రాశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. అక్షయ్ తల్లి అరుణ భాటియా మరణంపై సంతాపం తెలుపుతూ లెటర్ రాసిన మోడీ.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన మార్క్ చూపించేందుకు ఇన్నేళ్లు కష్టపడ్డ అక్షయ్‌ను అభినందించారు. తల్లిదండ్రులు అతనికి నేర్పిన విలువల గురించి స్పెషల్‌గా మెన్షన్ చేసిన ప్రధాని.. అరుణ బాటియా చనిపోయిన రోజు అక్షయ్‌కు పర్సనల్‌గా కాల్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసిన అక్షయ్.. ‘అమ్మ మరణంతో పరామర్శించిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. నా దివంగత తల్లిదండ్రుల కోసం సమయాన్ని వెచ్చించిన పీఎం అమేజింగ్ గెశ్చర్‌కు థాంక్స్. ఈ ఓదార్పు మాటలు ఎప్పటికీ నాతోనే ఉంటాయి’ అంటూ పోస్ట్ పెట్టాడు.

Next Story

Most Viewed