- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బాలీవుడ్ టాప్ హీరో అక్షయ్ కుమార్ ఎప్పుడూ కూల్గా, పీస్ఫుల్గా ఉంటారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా స్ర్పెడ్ అయిన ఓ రూమర్.. అక్షర్ ఆగ్రహానికి కారణమైంది. లాక్డౌన్ సమయంలో అక్షయ్.. తన సోదరితో పాటు ఆమె పిల్లలను ప్రత్యేక ఫ్లైట్లో ఢిల్లీకి పంపినట్టు కొన్ని వెబ్సైట్లలో రూమర్స్ వెలువడ్డాయి. తాజాగా దీనిపై స్పందించిన అక్షయ్.. తన గురించి తప్పుడు వార్తలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ‘నా సోదరి, ఆమె పిల్లల కోసం ప్రత్యేకంగా విమానాన్ని బుక్ చేశానని వస్తున్న వార్తల్లో నిజం లేదు. అది పూర్తిగా అవాస్తవం. లాక్డౌన్ సమయంలో ఆమె ఎక్కడికీ ప్రయాణించలేదు. అదీగాక ఆమెకు ఒక్కరే సంతానం. ఇలా వాస్తవాలు తెలుసుకోకుండా, ఇష్టమైన రీతిలో తప్పుడు వార్తలు రాస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’ అంటూ అక్షయ్ హెచ్చరించారు. కాగా అక్షయ్ ట్వీట్తో సదరు వెబ్సైట్ ఆ న్యూస్ను తొలగించింది.