- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: అక్కినేని హీరో అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్’ సినిమాతో సమ్మర్ ఎంటర్టైన్మెంట్కు రెడీ అవుతున్నాడు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీతో పక్కా సూపర్ హిట్ కొట్టాలని ప్లాన్ చేస్తున్నాడు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రం తర్వాత సురేందర్రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ చేయబోతున్నాడు అఖిల్. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రూపుదిద్దుకుంటున్న మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగా.. డైరెక్టర్ సురేందర్రెడ్డి హీరోయిన్ను ఫైనల్ చేసేశాడని సమాచారం.
ముంబైకి చెందిన మోడల్ వైద్యా సాక్షిని అఖిల్కు జోడిగా కన్ఫర్మ్ చేశాడని తెలుస్తోంది. తనకు సంబంధించిన పలు యాడ్ ఫిల్మ్స్, ఇన్ స్టాగ్రామ్ పిక్చర్స్ చెక్ చేసిన సురేందర్రెడ్డి.. హైదరాబాద్లో ఆడిషన్ కూడా తీసుకున్నారని సమాచారం. యంగ్ బ్యూటీ యాక్టింగ్ స్కిల్స్కు ఇంప్రెస్ అయిన ఆయన..దీనిపై త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని టాక్. ఈ విషయాన్ని ఓ నేషనల్ చానల్ ఇంటర్వ్యూలో తెలిపిన డైరెక్టర్..సాక్షి నేచురల్ పర్ఫార్మర్ అని, తన క్యారెక్టర్కు స్పార్క్ యాడ్ చేయగలదు అని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు. అనిల్ సుంకరతో కలిసి సురేందర్రెడ్డి కూడా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా..వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.