- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, దేవరకద్ర: అఖండ సినిమా యూనిట్ తో పాటు దేవర్ కద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బలాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే ఆల, దర్శకుడు బోయపాటి శ్రీను, సినిమా యూనిట్ తో కలిసి బాలకృష్ణ ప్రధానాలయ రాతి కట్టడాలను తిలకించారు. యాదాద్రి ఆలయం మహాద్బుతమైన దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకున్నదని, ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
హీరో బాలక్రిష్ణ. తన ఇష్టదైవం లక్ష్మీ నరసింహస్వామి అని, తాను చిన్ననాటి నుంచి యాదాద్రికి వస్తున్నాని కానీ ఇంత అద్భుతముగా ఆలయం అభివృద్ధి కావడం, ఈ ఆలయాన్ని తాను చూడటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాని అన్నారు. లక్ష్మీ నరసింహస్వామి కృపతో తెలుగు రాష్టాల ప్రజలు సు:ఖ సంతోషాలతో, సిరి సంపదలతో జీవించాలని ఆయన అన్నారు.
కరోనా మహమ్మరి నుంచి లక్ష్మీ నరసింహస్వామి వారు ప్రజలందరినీ కాపాడాలని మొక్కుకున్నట్లు తెలిపారు. ఆలయ ఈఓ గీత, ప్రధానార్చకులు, అర్చక బృందం బాలకృష్ణ కు, చిత్ర బృందానికి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. దర్శన అనంతరం తీర్థ ప్రసాదాలతో పాటు వేద ఆశీర్వచనాలు అందించారు.