ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చిన అజిత్

by  |
ఫ్యాన్స్‌కు వార్నింగ్ ఇచ్చిన అజిత్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ సూపర్ స్టార్ అజిత్‌ ఫ్యాన్స్‌పై ఫైర్ అయ్యాడు. అంతేకాదు ఓ అభిమాని నుంచి ఫోన్ గుంజుకొని జేబులో పెట్టుకున్నాడు. అజిత్ ఏంటీ..? ఫ్యాన్స్‌తో ఇలా వ్యవహారించాడని ఆశ్చర్యపోతున్నారా.. కానీ, మీరు విన్నది నిజం. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చెన్నైలోని తిరువాన్మయూర్ పోలింగ్ కేంద్రంలో అజిత్ ఓటు వేసేందుకు వచ్చాడు. ఇదే సమయంలో అక్కడ ఉన్న ఓటర్లు, అభిమానులు అజిత్‌తో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. దీంతో వారిని నిలువరించే ప్రయత్నం చేసిన అజిత్… ఓ అభిమాని నుంచి ఫోన్ తీసుకొని జేబులో పెట్టుకున్నాడు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించడం గమనార్హం.


Next Story