నిఖిల్, ఐశ్వర్య గ్రీన్ ఇండియా చాలెంజ్

by  |
నిఖిల్, ఐశ్వర్య గ్రీన్ ఇండియా చాలెంజ్
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ శ్రీకారం చుట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చెయిన్ కొనసాగుతూనే ఉంది. పర్యావరణం, పచ్చదనం ప్రాముఖ్యతను తెలుపుతూ సెలెబ్రిటీలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. తాజాగా ఈ చాలెంజ్ స్వీకరించిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, హీరో నిఖిల్ సిద్ధార్థ్ మొక్కలు నాటారు. నటుడు రాజా రవీంద్ర నుంచి చాలెంజ్ స్వీకరించిన నిఖిల్.. తర్వాత ‘18 పేజెస్’ టీమ్‌‌ను నామినేట్ చేశారు. దీంతో పాటు అవికా గోర్, కలర్స్ స్వాతిని కూడా నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు.

ఇక హీరో సుశాంత్ గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించిన ఐశ్వర్య మొక్కలు నాటారు. తర్వాత ఫ్యాన్స్‌ను నామినేట్ చేసిన ఐష్.. చెయిన్ కొనసాగించాలని కోరారు. కాగా ఇప్పటికే మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములైన అభిమానులు.. ఇందుకు సంబంధించిన పిక్స్ అప్‌లోడ్ చేస్తున్నారు.



Next Story