ఇండో-అమెరికన్ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన ఐశ్వర్య రాయ్ 

by  |
Aishwarya Rai
X

దిశ, సినిమా: అందాల తార ఐశ్వర్య రాయ్ బచ్చన్ ఇటీవలే మణిరత్నం దర్శకత్వంలో వస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్’ ఫస్ట్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసింది. తాజాగా ఈ భామ ఇండో-అమెరికన్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ పుస్తకం ‘త్రీ ఉమెన్’ ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రముఖ థియేటర్ రైటర్-డైరెక్టర్ ఇషితా గంగూలీ దర్శకత్వం వహించనున్నారు.

మొదటగా ఈ సినిమాను హిందీలోనే రూపొందించాలని అనుకున్నప్పటికీ.. ఠాగూర్ కోడలు అయిన కాదంబరి దేవీ ఉత్తరం చుట్టూ ఈ చిత్రం తిరుగుతుండటం, అదే విధంగా కథలోని ప్రతీ సీన్ అర్బన్ అమెరికన్ సెన్సిబిలిటీస్‌తో ముడిపడి ఉండటంతో ఈ మూవీని ఇంగ్లీష్‌లో తీస్తే బాగుటుందని స్వయంగా ఐశ్వర్య సజెస్ట్ చేసిందని ఇషితా గంగూలీ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఐశ్వర్య స్క్రిప్ట్‌ చదివాక చాలా ఎగ్జయిట్ అయ్యారని, తనతో సినిమా చేయడం సంతోషంగా ఉందని చెప్పింది.

ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘రాధే శ్యామ్’ నుంచి మరో బిగ్ అప్ డేట్

Next Story

Most Viewed