85 సంవత్సరాలు పూర్తి.. అందుకే వేడుకలు

by  |
85 సంవత్సరాలు పూర్తి.. అందుకే వేడుకలు
X

దిశ, సిద్దిపేట: అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఎఐఎస్ఎఫ్) 85వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట జిల్లా సమితి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో ఎఐఎస్ఎఫ్ మాజీ ఉమ్మడి మెదక్ జిల్లా కార్యదర్శి మంద పవన్ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు.

ఈ సంధర్భంగా మంద పవన్ మాట్లాడుతూ విద్యార్థి సంఘం చేస్తున్న కృషిని కొనియాడారు. విద్యారంగ సమస్యలపై ఎఐఎస్ఎఫ్ నిరంతర పోరాటం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సంగెం మధు, జేరిపోతుల జనార్ధన్, ఆర్గనైజింగ్ కార్యదర్శి మిట్టపల్లి సుధాకర్, సహాయ కార్యదర్శి చిట్యాల శేఖర్, ఉపాధ్యక్షులు మిట్టపల్లి నవీన్, నాయకులు మన్నే మహేష్, ఎఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు కనుకుంట్ల శంకర్, నాయకులు కిష్టపురం లక్ష్మణ్, ఇంజమూరి నరేష్, మహేందర్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed