ఎయిర్‌టెల్ భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్!

by  |
ఎయిర్‌టెల్ భారీ క్యాష్‌బ్యాక్ ఆఫర్!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లను కొన్న వారికి రూ. 6,000 వరకు క్యాష్‌బ్యాక్‌ను ఇవ్వనున్నట్టు శుక్రవారం వెల్లడించింది. రూ. 12,000 కు మించిన ధరలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌లను కొన్న వారికి ఈ ఆఫర్ లభిస్తుందని, ఈ క్యాష్‌బ్యాక్ మొత్తాన్ని రెండు దశల్లో వినియోగదారులకు ఇవ్వనున్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది. ‘మేరా పెహ్‌లా స్మార్ట్‌ఫోన్’ కార్యక్రమం కింద ఈ ఆఫర్‌ను ఇస్తున్నట్టు పేర్కొంది. ఈ ఆఫర్ కావాలనుకున్నవారు ఎయిర్‌టెల్ ఎంపిక చేసిన 150కి స్మార్ట్‌ఫోన్లలో ఏదైనా ఒకటి కొనాల్సి ఉంటుంది.

అంతేకాకుండా వినియోగదారులు ఈ ప్రయోజనాలు పొందడానికి 36 నెలల వరకు రూ. 249, అంతకుమించిన ఎక్కువ ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ రీఛార్జ్‌లను చేయాల్సి ఉంటుంది. ఇలా రీఛార్జ్ చేసిన వినియోగదారులకు మొదటి 18 నెలల తర్వాత రూ. 2,000, 36 నెలలు పూర్తయిన తర్వాత మిగిలిన రూ. 4,000 క్యాష్‌బ్యాక్‌ను ఎయిర్‌టెల్ తన పేమెంట్ బ్యాంక్‌లో పొందవచ్చు. అంతేకాకుండా కస్టమర్ కొనే స్మార్ట్‌ఫోన్‌కు ఏదైనా డ్యామెజీ ఏర్పడితే ఏడాది పాటు ఉచితంగా స్క్రీన్ రీప్లేస్‌మెంట్ సదుపాయg ఇస్తున్నట్టు ఎయిర్‌టెల్ వివరించింది. ఇంకా ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ద్వారా వింక్ మ్యూజిక్, అమెజాన్ ప్రైమ్‌లను 30 రోజుల వరకు ఉచితంగా వినియోగించవచ్చని కంపెనీ వెల్లడించింది.


Next Story

Most Viewed