ఏయిర్ ఇండియా విమానం క్రాష్.. పైలట్ మృతి

by  |
ఏయిర్ ఇండియా విమానం క్రాష్.. పైలట్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్: కేరళ రాష్ట్రంలోని కోజికోడ్ ఏయిర్ పోర్టులో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పిన విమానం రన్ వే ను దాటి 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. దీంతో విమానం రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో పైలట్ అక్కడికక్కడే మృతిచెందగా, 80మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి.

శుక్రవారం సాయంత్రం సరిగ్గా 7.40 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానంలో 191మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. దుబాయ్ నుంచి కోజికోడ్ చేరుకున్న విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పింది. ఏయిర్ పోర్టులో కుండపోత వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. సుమారు 20 అంబులెన్స్‌లు సహాయక చర్యల్లో పాల్గొని క్షతగాత్రులకు వైద్యం అందిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed