హాంకాంగ్‌కి ఎగురబోనన్న ఎయిరిండియా

by  |
హాంకాంగ్‌కి ఎగురబోనన్న ఎయిరిండియా
X

రోనా వైరస్ విజృంభిస్తుండడంతో ఈ నెల 8 నుంచి ఢిల్లీ- హాంకాంగ్ మధ్య విమాన సర్వీస్‌లను నిలిపివేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా హాంకాంగ్‌లో ఓ వ్యక్తి మరణించినట్లు అక్కడి అధికారులు వెల్లడించిన కొద్దిసేపటికే ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఎయిర్ ఇండియా చైర్మన్, ఎండీ అశ్వినీ లోహానీ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ‘ కరోనా వైరస్ కారణంగా హాంకాంగ్‌కు విమానాలను నిలిపివేయాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. 2020 ఫిబ్రవరి 7న ఏఐ 314 విమాన సర్వీస్ చివరిది’. అంటూ ఆయన ట్వీట్ చేశారు.



Next Story