కరోనాతో పోరులో ఎయిర్ఇండియా సాయం!!

by  |
కరోనాతో పోరులో ఎయిర్ఇండియా సాయం!!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను నిలువరించేందుకు దేశమంతా ఇంటికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా రవాణా నిలిచిపోయింది. అయితే, కరోనా వ్యాప్తి వల్ల ఇబ్బందులు తలెత్తకుండా పరీక్షల కోసం కరోనా కిట్లను అత్యవసరంగా పంపించేందుకు యుద్ధ ప్రాతిపదికన ఎయిర్ఇండియా విమానాల ద్వారా హాస్పిటల్స్‌కు పంపించాలని పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ ప్రకటించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ రూపొందించిన కరోనా కిట్లను ఢిల్లీ నుంచి కోల్‌కతా, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు ఇదివరకే పంపించినట్టు ఆయన పేర్కొన్నారు. అలాగే ముంబై ప్రాంతం నుంచి తిరువనంతపురం, బెంగలూరు, పూణె నగరాలకు, పంపనున్నట్టు ఆయ వివరించారు.

Tags: Air India, Alliance Air, coronavirus, boeing, Boeing 787


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed