రెండు డోసులు తీసుకున్నా.. మాస్కు పెట్టుకోవాల్సిందే

by  |
రెండు డోసులు తీసుకున్నా.. మాస్కు పెట్టుకోవాల్సిందే
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్లపై దిల్లీలోని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు డోసుల టీకా తీసుకున్న తర్వాత కూడా మాస్కు తప్పనిసరిగా ధరించడం, భౌతికదూరం పాటించడం చేయాలని సూచించారు. కొత్త వేరియంట్లను ఎదుర్కొనే సామర్థ్యం వ్యాక్సిన్లకు ఉందా.. లేదా? అనేది తెలియాల్సి ఉందన్నారు. అప్పటివరకు అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని చెప్పారు.

మాస్కు, భౌతికదూరం పాటిస్తే ఏ వేరియంట్‌నైనా ఎదుర్కొవచ్చని రణ్‌దీప్ గులేరియా తెలిపారు. రెండు డోస్‌లు తీసుకున్నవారికి కరోనా రాదనే అభిప్రాయాల నేపథ్యంలో ఎయిమ్స్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

Next Story

Most Viewed