థర్డ్ వేవ్ రాదు.. ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు

by  |
థర్డ్ వేవ్ రాదు.. ఎయిమ్స్ డైరెక్టర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా థర్డ్ వేవ్‌పై ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కీలక వ్యాఖ్యలు చేశారు. థర్డ్ వేవ్ వస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవన్నారు. చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని చెప్పడానికి కూడా ఆధారాలు లేవని వెల్లడించారు. థర్డ్ వేవ్ ప్రభావం చిన్నపిల్లలపై ఉంటుందని ఇటీవల డాక్టర్లు, సైంటిస్టులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో చిన్నపిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర కుటుంబ, మంత్రిత్వశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది.

అయితే థర్డ్ వేవ్ ప్రభావం చిన్నపిల్లలపై అంతగా ఉండదని, వచ్చినా హోం ఐసోలేషన్‌లోనే 90 శాతం మంది పిల్లలు కోలుకుంటారనే నివేదికలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో అందుకు భిన్నంగా చిన్నపిల్లపై థర్డ్ వేవ్ ప్రభావం ఉండదని, థర్డ్ వేవ్ వస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని ఎయిమ్స్ డైరెక్టర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.


Next Story

Most Viewed