తెలంగాణ.. పంజాబ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి !

by  |
తెలంగాణ.. పంజాబ్‌ను ఆదర్శంగా తీసుకోవాలి !
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను అడ్డుకోవాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఎన్డీయే ప్రవేశపెట్టిన చట్టాలకు వ్యతిరేకంగా ప్రకటన చేసి ముసలి కన్నీరు కారిస్తే సరిపోదని, ఆ చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు గురువారం లేఖ రాశారు. పంజాబ్‌ను ఆదర్శంగా తీసుకొని కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో కొత్త చట్టాలు రూపొందించాలన్నారు. సోనియా గాంధీ సెప్టెంబర్ 28న సూచించినట్టుగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 (2) ఆధారంగా రాష్ట్రంలో కొత్త చట్టాలు తెచ్చి రైతులకు కనీస మద్దతు ధరకు భరోసా కల్పించాలన్నారు. రాష్ట్రం తెచ్చే ఈ రైతు చట్టాల ఏకగ్రీవ ఆమోదానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందని వెల్లడించారు. అకాల వరదలకు నష్టపోయిన పంటలకు ప్రతి ఎకరాకు రూ.20వేల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed