టీమ్ వర్క్‌తో నే విజయం ఖాయం…

by  |
టీమ్ వర్క్‌తో నే విజయం ఖాయం…
X

దిశ వెబ్ డెస్క్ :
టీమ్ వర్క్ చేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఏఐసీసీ ఇన్ చార్జ్ మనిక్కమ్ ఠాగూర్ అన్నారు. తెలంగాణ కోర్ కమిటీ సమావేశాన్ని ఆయన అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..అందరూ క్రమశిక్షణతో పనిచేయడం ముఖ్యమని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన సూచించారు. ప్రతినెలలో రెండు సార్లు క్రమం తప్పకుండా కోర్ కమిటీ సమావేశాలను నిర్వహించాలని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో నిరంతరం క్షేత్ర స్థాయి ఉద్యమాలు చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు ఆయన సూచించారు. సెప్టెంబర్ 28న వినతి పత్రం అందజేయాలని ఆయన తెలిపారు. అక్టోబర్ 2 న రాష్ట్ర వ్యాప్తంగా కిసాన్ మజ్దూర్ బచావో దినంగా పాటించాలని ఆయన అన్నారు.



Next Story

Most Viewed