నేనే సీఎం క్యాండెట్‌ని : జానారెడ్డి

by  |
నేనే సీఎం క్యాండెట్‌ని : జానారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ కీలక నేత, మాజీ మంత్రి జానారెడ్డి పార్టీ మారుతున్నట్ట ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. అంతేగాకుండా బీజేపీ నేత డీకే అరుణ, జానా తనయుడు కుందూరు రఘువీర్‌రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. తాజాగా దీనిపై క్లారిటీ కోసం ఏఐసీసీ ‌ఇన్‌చార్జి మాణిక్కం ఠగూర్ జానారెడ్డికి ఫోన్ చేశారు. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై ఇరువురు మాట్లడుకున్నారు. ఈ సందర్భంగా జానారెడ్డి ఠాగూర్‌తో మాట్లాడుతూ.. ‘‘నేనెందుకు పార్టీ మారతా.. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చే వార్తలన్నీ తప్పుడు ప్రచారాలు’ అని జానారెడ్డి ఠాగూర్‌తో చెప్పాడు. అంతేగాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. తానే సీఎం అభ్యర్థిని అని జానా వెల్లడించినట్టు సమాచారం.



Next Story