- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అగ్రిగోల్డ్ సంస్థ డైరెక్టర్ మృతి
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్డెస్క్: అగ్రిగోల్డ్ సంస్థ డైరెక్టర్ అవ్వా ఉదయ భాస్కర్ రావు గురువారం రాత్రి హఠత్ మరణం చెందారు. గుండెల్లో నొప్పి అంటూ ఇంట్లోనే కుప్పకూలిన ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కాగా, అగ్రిగోల్డ్ డిపాజిట్ల కేసులో ఆ సంస్థ డైరెక్టర్లను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, ఆ తర్వాత వారు బెయిలుపై బయటకు వచ్చారు. ఆకర్షణీయమైన వడ్డీలు చెల్లిస్తామంటూ 8 రాష్ట్రాలకు చెందిన దాదాపు […]</p>

X
దిశ, వెబ్డెస్క్: అగ్రిగోల్డ్ సంస్థ డైరెక్టర్ అవ్వా ఉదయ భాస్కర్ రావు గురువారం రాత్రి హఠత్ మరణం చెందారు. గుండెల్లో నొప్పి అంటూ ఇంట్లోనే కుప్పకూలిన ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. కాగా, అగ్రిగోల్డ్ డిపాజిట్ల కేసులో ఆ సంస్థ డైరెక్టర్లను ఈడీ అరెస్ట్ చేసింది. అయితే, ఆ తర్వాత వారు బెయిలుపై బయటకు వచ్చారు.
ఆకర్షణీయమైన వడ్డీలు చెల్లిస్తామంటూ 8 రాష్ట్రాలకు చెందిన దాదాపు 32 లక్షల మంది నుంచి రూ. 6.5 వేల కోట్ల డిపాజిట్ సేకరించిన అగ్రిగోల్డ్ సంస్థ వారిందరినీ ముంచింది. రంగంలోకి దిగిన ఈడీ.. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, తెలంగాణలో అగ్రిగోల్డ్కు ఉన్న దాదాపు రూ. 4,109 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. దశాబ్దాలు గడుస్తున్నా ఈ కేసు ఇంకా దర్యాప్తు దశలోనే ఉంది. బాధితులకు న్యాయం జరగలేదు.
Next Story






