- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- కెరీర్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- ఆరోగ్యం
- స్పోర్ట్స్
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫోటోలు
- జిల్లా వార్తలు
- భక్తి
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: తెలంగాణ సాగులో దేశంలోనే నెంబర్ వన్గా నిలిచిందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సాగులో ఏ రాష్ట్రం మన దరిదాపుల్లో కూడా లేదన్నారు. ఈ ఏడాది 39 శాతం అధికంగా సాగు అయిందన్నారు. శనివారం వనపర్తిలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యావేక్షణ కమిటీ సమావేశానికి మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం పాఠశాలల అదనపు గదులు, మరుగుదొడ్ల నిర్మాణాలపై అధికారులు దృష్టిసారించాలని సూచించారు. సాగునీటి కారణంగా వ్యవసాయంలో మోటార్ల వినియోగం పెరిగిందని, దీంతో కరెంటు వినియోగం కూడా పెరిగిందన్నారు. జిల్లాకు త్వరలో 400 ట్రాన్స్ ఫార్మార్లను అందజేయనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా, జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Next Story