మంజీరా నదిలో దూకిన అగ్రికల్చర్ ఏవో

by  |
మంజీరా నదిలో దూకిన అగ్రికల్చర్ ఏవో
X

దిశ, వెబ్‌డెస్క్ : సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వ్యవసాయశాఖలో ఏవోగా విధులు నిర్వహిస్తున్న అరుణ అనే మహిళా అధికారిణి మంజీరా నదిలో దూకి ప్రాణాలు తీసుకుంది.ఈ ఘటన సంగారెడ్డి జిల్లా మనుర్ మండలం రాయిపల్లిలో గురువారం వెలుగులోకి వచ్చింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతురాలి వివరాలు సేకరించారు. కుటుంబ కలహాలే ఆ మహిళ ఆత్మహత్యకు పాల్పడేలా ప్రేరేపించి ఉంటాయని వారు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


Next Story