ధనిక రాష్ట్రంలో కోత సరికాదు:నర్సిరెడ్డి

by  |
ధనిక రాష్ట్రంలో కోత సరికాదు:నర్సిరెడ్డి
X

దిశ, నల్లగొండ: ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతాల్లో కోత విధించడాన్ని నిరసిస్తూ.. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి హాజరై మద్దతు పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఉద్యోగుల జీతాల్లో విధించిన కోతలను తొలగించి పూర్తి వేతనం ఇవ్వాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ధనిక రాష్ట్రంగా చెప్పుకునే కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు విధించటం సరికాదన్నారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పూర్తి స్థాయిలో చెల్లించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మే నెల జీతాన్ని పూర్తిగా చెల్లించాలని ఆయన కోరారు.



Next Story

Most Viewed