- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం పై ఇప్పటికీ పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుశాంత్ ది సూసైడ్ కాదని.. కొందరి ఒత్తిడి వలన.. మోసం చేయడం వలన చనిపోయాడని.. లేదు అందరూ కలిసి మానసికంగా హింసించి చంపేశారని పలు కథనాలు వెలువడటమే కాగా, పలువురు సెలెబ్రిటీలు, రాజకీయ నేతలు ఆరోపించారు. అతని ఫ్యాన్స్ మాత్రం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని.. అప్పుడే నిస్పక్షపాతంగా విచారణ జరిగి అతని కుటుంబానికి న్యాయం జరుగుతుందని కోరుతున్నారు. తాజాగా, ఈ కేసు విషయంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే తనయుడు, మంత్రి ఆదిత్య థాక్రే స్పందించారు.
సుశాంత్ మృతికి తనకు ఎలాంటి సబంధంలేదని.. కావాలనే కొందరు తన ఫ్యామిలీపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి ఆదిత్య థాక్రే హస్తముందంటూ వస్తున్న వార్తలు అవాస్తమని.. దీనిని ఖండిస్తున్నట్లు వివరించారు. సుశాంత్ మరణానికి తనకు, తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన మరోసారి స్పష్టంచేశారు.