టెన్త్, ఇంటర్ పరీక్షలపై మంత్రి సురేష్ క్లారిటీ

by  |
టెన్త్, ఇంటర్ పరీక్షలపై మంత్రి సురేష్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్లారిటీ ఇచ్చారు. పరీక్షలు నిర్వహించి తీరుతామని, పరీక్షలు రద్దు చేయాలని తల్లిదండ్రులు కోరడం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు దీనిపై అవనసరంగా రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. కాగా కరోనా ప్రభావం క్రమంలో పది, ఇంటర్ పరీక్షలు ఏపీ ప్రభుత్వం వాయిదా వేయగా.. నిర్వహణపై జూన్ లో సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఇప్పటికే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పరీక్షలను రద్దు చేశాయి. కేంద్ర ప్రభుత్వం సీబీఎస్‌ఈ పరీక్షలను రద్దు చేసింది. ఈ క్రమంలో ఏపీలో కూడా టెన్త్, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలనే డిమాండ్లు వస్తున్నాయి.

Next Story

Most Viewed