- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ కుల్దీప్ సింగ్కు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) చీఫ్గా కేంద్ర ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్ వైసీ మోడీ(1984 బ్యాచ్ ఐపీఎస్ అధికారి) ఈ నెల 31న రిటైర్ కాబోతున్నారు. అసోం, మేఘాలయా క్యాడర్ అధికారి వైసీ మోడీని ఎన్ఐఏ చీఫ్గా 2017 సెప్టెంబర్లో కేంద్రం నియమించింది. తాజాగా, ఆయన పదవీ విరమణ చెందుతుండటంతో ఆ బాధ్యతలను సీఆర్పీఎఫ్ డీజీ కుల్దీప్ సింగ్కు అప్పగించింది. 1986 బ్యాచ్ పశ్చిమ బెంగాల్ క్యాడర్ అధికారి కుల్దీప్ సింగ్ ఈ బాధ్యతలను నూతన ఎన్ఐఏ డీజీని నియమించే వరకు చేపట్టాల్సి ఉంటుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో శనివారం వెల్లడించింది. సీఆర్పీఎఫ్ డీజీగా కుల్దీప్ సింగ్ తన రిటైర్మెంట్ (సెప్టెంబర్ 30, 22) వరకు కొనసాగనున్నారు.
Next Story