- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, క్రైమ్ బ్యూరో : పోలీసుల ప్రాణ త్యాగాల కారణంగానే ప్రజలంతా ప్రశాంతంగా జీవిస్తున్నారని రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్ బాబు అన్నారు. అలాంటి పోలీస్ శాఖకు ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) విభాగం గుండెకాయ లాంటిదన్నారు. రాచకొండ సాయుధ పోలీస్ దళాలు (ఏఆర్) డీమొబిలైజేషన్ పరేడ్ అంబర్ పేట్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హజరైన అడిషనల్ సీపీ సుధీర్ బాబు మాట్లాడుతూ… పోలీసులు ప్రతిరోజూ కొత్త కొత్త విషయాలను నేర్చకోవడం నిరంతర ప్రక్రియ కావాలని సూచించారు. కోవిడ్ –19, వరదల సమయాల్లో ఏఆర్ సిబ్బంది చాలా బాగా పని చేశారని తెలిపారు. ఆందోళన సమయంలో గుంపులుగా వస్తే ఎలా అడ్డుకోవాలి, నిలువరించాలి, ఎలా అదుపులోకి తీసుకురావాలి, టెర్రరిస్టులు దాడులు చేస్తే ఎలా అడ్డుకోవాలనే విషయాలపై ఏఆర్ సిబ్బంది చేసిన డెమో ఆకట్టుకుంది.
Next Story