యుద్ధక్షేత్రంలో అడుగుపెడుతున్నట్లు ఉంది : ఆదా శర్మ

by  |
యుద్ధక్షేత్రంలో అడుగుపెడుతున్నట్లు ఉంది : ఆదా శర్మ
X

తొలి సినిమాలోనే.. తన అందంతో కుర్రకారుకు ‘హార్ట్ ఎటాక్’ తెప్పించిన భామ ఆదా శర్మ. ఇటు టాలీవుడ్, అటు బాలీవువుడ్‌లో సినిమాలు చేస్తున్న ఈ అందాల భామ.. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్ విన్యాసాలతో ఫోటో షూట్‌లు, వీడియోలు చేస్తూ.. యూత్‌కు మంచి కిక్కిస్తుంటుంది. ఇక యోగా, మార్షల్ ఆర్ట్స్, కర్రసాముల్లో ఆదాశర్మకు మంచి పట్టున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ టైమ్‌లో పియానో వాయించి, అందులోనూ తన టాలెంట్‌ను చూపించుకుందీ బ్యూటీ. లాక్‌డౌన్ తర్వాత తొలిసారి కెమెరాను ఫేస్ చేసిన ఈ అందాల తార.. ఆ అనుభవాలను ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకుంది.

‘బ్యాక్‌ టు సెట్‌. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత నేను తొలిసారి సెట్‌లోకి అడుగుపెట్టాను. సెట్‌లో ఇరవైమంది మాత్రమే ఉన్నారు. ఓ కమర్షియల్ యాడ్ కోసం షూటింగ్‌ చేశాం. అందరూ మాస్క్‌లు ధరించారు. శానిటైజ్‌ అయ్యారు. సెట్‌లోకి అడుగుపెడుతుంటే యుద్ధక్షేత్రంలోకి అడుగుపెడుతున్నట్లు ఉంది. వీ ఆర్ ఆల్ సేఫ్ సైడ్.. అగెయినెస్ట్ కరోనా’ అని ఆదా శర్మ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆదా ‘మాన్ టూ మాన్ ’అనే హిందీ చిత్రంలో నటిస్తుంది. ఇటీవల కమాండో 3, బైపాస్ రోడ్ సినిమాల్లోనూ కనిపించింది. తెలుగులో చివరగా ‘కల్కి’ మూవీలో హీరోయిన్‌గా చేసిన విషయం తెలిసిందే.



Next Story

Most Viewed