సినీనటి రాధతో ఎస్సై ఎఫైర్.. విడదీసిన ఆధార్

by  |
సినీనటి రాధతో ఎస్సై ఎఫైర్.. విడదీసిన ఆధార్
X

దిశ, వెబ్ డెస్క్:చిత్ర పరిశ్రమలో వివాహేతర సంబంధాలు సాధారణంగా మారిపోతున్నాయి. సామాన్య ప్రజలతో పాటు సినీ ప్రముఖులు కూడా వివాహేతర సంబంధాలకు దగ్గరయ్యి.. మోసపోతున్నారు. తాజాగా కోలీవుడ్ కి చెందిన వర్ధమాన నటి రాధ పోలీసు స్టేషన్ మెట్లెక్కారు. తనను ఓ పోలీస్ అధికారి మోసం చేశాడంటూ ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ‘సుందరం ట్రావెల్స్’ మూవీతో హీరోయిన్ గా కోలీవుడ్ కి పరిచయమైన నటి రాధ, వసంత్ రాజ్ అనే వ్యక్తిని వివాహమాడారు. వీరికి ఒక కుమారుడు.

కాగా, కొన్నేళ్ల క్రితం అభిప్రాయం బేధాలు రావడంతో భర్తను వదిలి రాధ శాలిగ్రామంలోని లోకయ్య వీధిలో తల్లి , కుమారుడితో నివశిస్తుంది. ఈ నేపథ్యంలోనే తిరువాన్మియూరు ఎస్‌ఐ వసంత్‌ రాజ్‌తో ఓ సినిమా షూటింగ్‌ సందర్భంలో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధం గా మారింది. పెళ్ళై విడాకులు తీసుకున్న రాధ, పెళ్ళై పిల్లల ఉన్న వసంతరాజ్ కి దగ్గరయ్యారు. రాధ కోసం ఎస్ఐ వసంతరాజ్ తిరువాన్మీయూరు నుంచి వడపళని స్టేషన్ కి పోస్టింగ్ మార్పించుకున్నారు. రాధ కారణంగా తన భర్త కుటుంబాన్ని, పిల్లలను పట్టించుకోవడం లేదని గతంలో వసంతరాజ్ భార్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఇక ఈ సమయంలోనే రాధ, వసంత రాజ్ పేరును తనకు భర్తగా, పిల్లలకు తండ్రిగా ఆధార్ కార్డులో రాధ నమోదు చేయించారు. ఇది తెలుసుకున్న వసంతరాజ్ ఆమెను దూరం పెట్టడం ప్రారంభించారు. తన పోస్టింగ్ కూడా ఆమెకు దూరంగా ఎన్నూరుకు మార్పించుకున్నాడు. కావాలనే వసంత రాజ్ తనను దూరం పెడుతున్నాడని గ్రహించిన రాధ పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేశారు. వసంతరాజ్ కి తనకు వివాహం కూడా జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు.


Next Story

Most Viewed