మెగా ఫ్యామిలీకి గుడ్‌న్యూస్.. సాయి ధరమ్ తేజ్ నోట ఓ మాట

by  |
మెగా ఫ్యామిలీకి గుడ్‌న్యూస్.. సాయి ధరమ్ తేజ్ నోట ఓ మాట
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో సాయి ధరమ్ తేజ్ అపోలో ఆస్పత్రిలో చికిత్సకు స్పందిస్తున్నాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఒక నిమిషం పాటు వీడియో కాల్ మాట్లాడారు. ఆ నిమిషం వీడియో కాల్‌లో నొప్పిగా ఉందంటూ ఒకే ఒక మాట మాట్లాడారు. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ సాయి ధరమ్ తేజ్‌ను నయం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండటం.. చికిత్సకు స్పందించడంతో మెగా ఫ్యామిలీకి కాస్త టెన్షన్ తగ్గింది. కాగా, నిన్న రాత్రి రాయదుర్గం కేబుల్ బ్రిడ్జి సమీపంలోని ఐకియా వద్ద సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన్ని చికిత్స నిమిత్తం మెడికవర్, అనంతరం అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story