Jagapathi Babu: ఆనందయ్యకు మద్దుతుగా నిలిచిన టాలీవుడ్ స్టార్ నటుడు

by  |
Jagapathi Babu: ఆనందయ్యకు మద్దుతుగా నిలిచిన టాలీవుడ్ స్టార్ నటుడు
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు ఆనందయ్య. కరోనా విజృంభన వేళ ఆయన తయారు చేసిన మందు గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ఆయన మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు అధికారులు నేడు, రేపు అంటూ సమయం దాట వేస్తున్నారు. ఈ క్రమంలో ఆనందయ్యకు ప్రముఖుల నుంచి మద్దుతు పెరుగుతోంది.

తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో జగపతి బాబు.. ఆనందయ్యకు మద్దుతుగా నిలిచారు. జన జీవనం కరోనాతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. ప్రకృతి తల్లి మనల్ని రక్షించడానికి ఆయన రూపంలో వచ్చిందేమోనని అనిపిస్తుంది. సహజసిద్ధమైన ఆయన వైద్యానికి త్వరలోనే ప్రభుత్వం నుంచి అనుమతి రావాలని ప్రార్ధిస్తున్నాను. ఈ మందు ప్రపంచాన్ని కాపాడాలి, దేవుడు ఆయనను ఆశీర్వదించాలి అని జగపతి బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story

Most Viewed