- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్ : హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ తన అభిమానికి ఫోన్ చేసి పరామర్శించారు. చిత్తూరు జిల్లాకు చెందిన మురుగేశ్ అనే వ్యక్తి నందమూరి కుటుంబానికి వీరాభిమాని. ఇటీవల చెట్టు మీద నుంచి కిందపడి మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న నందమూరి బాలయ్య ఆదివారం మురుగేశ్కు కాల్ చేసి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఆదిత్య 369 సినిమా షూటింగ్ సమయంలో తనకు కూడా నడుం విరిగిందని.. అయినా తిరిగి కోలుకున్నానని, ధైర్యంగా ఉండాలని అభిమానికి సూచించాడు నందమూరి నటసింహం. అంతేకాకండా అభిమాని దీనస్థితిని చూసి చలించిపోయిన బాలయ్య రూ.40వేల ఆర్థిక సాయం అందజేశాడు. మురుగేశ్ కుటుంబం చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గొల్లపల్లిలో నివాసముంటున్నారు. కాగా, అభిమానులను ఎప్పుడు కసిరించుకుంటున్నాడని పేరున్న బాలయ్య.. ఇలా కష్టాల్లో ఉన్నవారికి సాయం కూడా అందించాడని తెలిసి నందమూరి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు.