కార్యకర్తల అభిమానం.. ఎమ్మెల్యే ఈటలకు తులాభారం.. మొక్కులు చెల్లింపు

by  |
కార్యకర్తల అభిమానం.. ఎమ్మెల్యే ఈటలకు తులాభారం.. మొక్కులు చెల్లింపు
X

దిశ, హుజురాబాద్ : ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అభిమానులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల పోరులో గెలిచినట్లయితే ఈటల ఎత్తు బెల్లాన్ని చెల్లిస్తామని మొక్కుకున్నట్టు అభిమానులు తెలిపారు. దీనిలో భాగంగా కమలాపూర్ మండలం గూడూరు గ్రామానికి చెందిన వినయ్ కుమార్, గట్టు రమేష్‌లు హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం ఈటలను తరాజులో వెయిట్ చేయగా 56 కిలోల బరువు ఉన్నారు. దీంతో 56 కిలోల బెల్లాన్ని వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయంలో చెల్లించి మొక్కులు తీర్చుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు.

Next Story

Most Viewed