దిశ ఎఫెక్ట్: కానిస్టేబుల్‌పై చర్యలు

by  |
దిశ ఎఫెక్ట్: కానిస్టేబుల్‌పై చర్యలు
X

దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన కరణ్ అనే వ్యక్తిని ఓ ట్రాఫిక్ పోలీస్ విచక్షణారహితంగా గాయపరిచిన విషయాన్ని దిశ వెలుగులోకి తీసుకురావడంతో జిల్లా అధికారులు చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుల్‌ను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఎస్పీ సాయి శేఖర్ నిర్ణయం తీసుకున్నారు. తన పిల్లలకు పాల కోసం లాక్ డౌన్ నిబంధన సమయంలో బయటికి వచ్చాడన్న నెపంతో ట్రాఫిక్ కానిస్టేబుల్ లాఠీ ఝలిపించడంపై సీరియస్ అయ్యారు. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకుచ్చిన దిశ యాజమాన్యానికి బాధితుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.



Next Story

Most Viewed