- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ,సిద్దిపేట: కలెక్టర్ వెంకట్ రాంరెడ్డిపై చర్యలు తీసుకోవాలని పీసీసీ జనరల్ బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. గత నెలలో ఆత్మహత్య చేసుకుని మరణించిన దళిత రైతు బ్యాగరీ నర్సిములు కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత నెలలో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరు గ్రామానికి చెందిన దళిత రైతు నర్సిములు భూమిని ప్రభుత్వం అక్రమంగా లాక్కుందన్నారు. దీంతో మనస్తాపానికి గురై ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి తొత్తుగా వ్యవహరిస్తున్న కలెక్టర్ వెంకట్ రాంరెడ్డిని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మొట్టమొదట కలెక్టర్ పై చర్యలను తీసుకుంటామని హెచ్చరించారు.