పెండింగ్ ఈ-చలాన్‎లను చెల్లించిన ఏసీపీ

by  |
పెండింగ్ ఈ-చలాన్‎లను చెల్లించిన ఏసీపీ
X

దిశ, సిద్దిపేట: తన సొంత కారుపై పెండింగ్ ఉన్న నాలుగు ఈ-చలాన్‎లను సిద్దిపేట ఏసీపీ రామేశ్వర్ పేటీఎం ద్వారా డబ్బులు చెల్లించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. వాహనదారులు వారి సొంత వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్ జరిమానా చెల్లించాలని సూచించారు. త్వరలో పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం సిద్దిపేట పట్టణంలో పెద్ద ఎత్తున స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. మూడు కానీ అంతకంటే ఎక్కువ ఈ-చలాన్ పెండింగ్ ఉన్న వాహనదారులకు వారి ఫోన్ నెంబర్లకు మెసేజ్ వస్తుందని.. వెంటనే ఆన్‎లైన్‎లో జరిమానా చెల్లించాలని ఏసీపీ రామేశ్వర్ సూచించారు.



Next Story

Most Viewed