- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని కట్టాల్గూడలో ఈనెల 20న జరిగిన నవీన్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 6 నెలల క్రితం హంతకుల కుటుంబంలో ఒకరు అనారోగ్యంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. అతడి మరణానికి మృతుడు నవీన్ తండ్రి బాలయ్య చేతబడి చేసి చంపాడని అనుమానం పెంచుకున్నారు. అనంతరం హంతకులు బాలయ్య కొడుకుని చంపాలని పథకం పన్నారు. అందులో భాగంగానే ఈనెల 20న సాయంత్రం నవీన్ను నమ్మించి కట్టాల్గూడ శివారులోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి.. మద్యం తాగించారు. ఆపై బండరాయితో తలపై కొట్టి చంపారు. ఘటనా స్థలంలో పోలీసులకు మద్యం సీసాలు దొరకడంతో ఓ వైన్స్లోని సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ మేరకు విచారణ చేపట్టడంతో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. నలుగురు నిందితులను హత్యానేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు నల్లగొండ డీఎస్పీ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు.