- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వాజేడు:ప్రేమ పేరుతో మోసం చేసి ఆపై యువతిని పెట్రోల్ పోసి హత్య చేసిన నిందితుడు ప్రవీణ్ ఏటూర్ నాగారం పోలీస్ స్టేషన్ నుండి పరార్ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ఓ దళిత యువతిని ప్రేమ పేరుతో వశపరచుకుని గర్భవతిని చేసి పండంటి మగబిడ్డ పుట్టిన ఐదు నెలల తర్వాత ఆమెను వదిలించుకోవడానికి తల్లిదండ్రుల ప్రోద్భలంతో ముందస్తు పథకం ప్రకారం ప్రవీణ్ దళిత యువతి శిరీషపై పెట్రోల్ పోసి హత్య చేసిన సంఘటన పలువురికి విదితమే. ఈ ఘటన లో నిందితుడుగా భావించిన ప్రవీణ్ ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
ప్రవీణ్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్ కు తరలించేందుకు సిద్ధం చేయగా మూత్ర విసర్జన చేసి వస్తానని అని చెప్పి చాకచక్యంగా నిందితుడు ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ నుండి పరారైనట్లు తెలుస్తుంది. కాగా నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇదే పోలీస్ స్టేషన్ లో గతంలో మరో నిందితుడు పరారైనట్లు తెలుస్తుంది పోలీస్ స్టేషన్ నుండి నిందితులు పరారీ కావడం ఏంటని పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు పోలీస్ శాఖ నుండి పరోక్షంగా ఎవరైనా సహకారం అందిస్తున్నారా…? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకే పోలీస్ స్టేషన్ లో ఇలాంటి సంఘటన రెండుసార్లు జరగడం గమనార్హం గా మారింది.