జైలుకు తరలిస్తుండగా ఖైదీ పరారీ

by  |
జైలుకు తరలిస్తుండగా ఖైదీ పరారీ
X

దిశ వెబ్ డెస్క్: జైలుకు తరలిస్తుండగా ఖైదీ పారిపోయిన ఘటన యూపీలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లో కెళితే…లఖీంపూర్ ఖేరీలోని మితౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మైనర్ బాలికపై హీరాలాల్ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాగా ఆ కేసులో ఆ నిందితున్ని బైక్ పై ఇద్దరు కానిస్టేబుల్స్ జైలుకు తరలిస్తున్నారు. కాగా బైక్ లో పెట్రోల్ పోయించేందుకు ఓ బంక్ వద్ద పోలీసులు బైక్ ను ఆపారు. దీంతో అదును చూసి నిందితుడు పారిపోయాడు. కాగా నిందితుడిని పోలీసులు కొంత దూరం వెంబడించారు. కానీ అతన్ని పట్టుకోలేక పోయారు.

అయితే ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసింది. దీంతో ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు జరిపారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా చివరికి నిందితున్ని పోలీసులు పట్టుకోగలిగారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కానిస్టేబుల్స్ పై చర్యలకు అధికారులు ఆదేశించారు.

Read Also..

‘తెలిసేలోగా అంత్యక్రియలు పూర్తి’



Next Story